CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండలంలో పలు కుటుంబాల పరామర్శ... పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు...

Share it:


మన్యం మనుగడ, పినపాక:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. జానంపేట గ్రామపంచాయతీ ముకుందాపురం గ్రామానికి చెందిన గోవింద నాగేష్ (42) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముకుందాపురం గ్రామానికి చెందిన సాగి భద్రం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారి నివాసానికి వెళ్లి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జానంపేట గ్రామానికి చెందిన సూరినేని చంద్రశేఖర్ రావు  గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకొని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: