మన్యం టివి , మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను గురువారం నాడు మణుగూరు మండలం చిన్న రాయి గూడెం గ్రామానికి చెందిన మడకం నరసమ్మ తన సమస్యలు విన్నవించడానికి ప్రభుత్వ విప్ రేగా ను కలవడానికి వచ్చారు.ఈ సందర్భంగా వారికున్న సమస్యలను ఓపిగ్గా విన్నారు. అధైర్యపడొద్దు అండగా ఉంటా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు.అదేవిధంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కిలోలు బియ్యం ను విప్ రేగా చేతుల మీదుగా దివ్యంగురాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో టీఆరెఎస్ స్ధానిక ప్రజాప్రతినిధులు,నాయకులు వెన్న అశోక్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు సందీప్ రెడ్డి, రాహూల్ గౌడ్, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,టిఅరెస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: