మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీలోని మద్దుల గూడెం గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన గురించి విచారణ ప్రారంభమైంది.
మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు పినపాక మండలం మద్దులగూడెం గ్రామానికి చెందిన ఓ మూగ యువతీ పై అత్యాచారం జరిగిన ఘటనపై గ్రామంలో విచారణ చేపట్టారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో అసాంఘిక శక్తులకు ఆశ్రయం కలిపించవద్దని , గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మావోయిస్టులు జరిగే అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్నారని, అటువంటి వారి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ళ బయ్యారం సీఐ రాజగోపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: