గుండాల , సెప్టెంబర్ 7, (మన్యం మనుగడ) : మండలం పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర లాలయ్య గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. దశదినకర్మకు 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లింగగూడెం సర్పంచ్ నరసింహారావు, పార్టీ నాయకులు బొమ్మర్ల శ్రీను, జాడి ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: