* మావోయిస్టు పార్టీ చర్ల దళకమాండర్ రజితకు హాని తల పెడితే అధికార పార్టీ నాయకులు మూల్యం చెల్లించక తప్పదు
* చర్ల మావోయిస్టు దళ కమాండర్ రజిత,సభ్యులను కోర్టు లో హాజరు పరచాలి
* ఆజాద్ పేర లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
మన్యం మనుగడ, చర్ల:
చర్ల పోలీసు అదుపులో ఉన్న మావోయిస్టు పార్టీ చర్ల దళకమాండర్ రజిత,దళ సభ్యులకు హాని తల పెడితే అధికార పార్టీ నాయకులు,పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు ఆజాద్ పేరుతో బుధవారం లేఖ విడుదల చేశారు. పోలీస్ అదుపులో ఉన్న దళాన్ని తక్షణమే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. లేనియెడల పోలీస్ శాఖ అధికార పార్టీ నాయకులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు
Post A Comment: