మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , పలు శాఖల ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా BTPS కు బొగ్గు రవాణా కోసం జరుగుతున్న రైల్వే లైన్ నిర్మాణంలో భూములను కోల్పోయిన నిర్వాసితులకు ఎలాంటి ఆందోళన చెందకుండా, మెరుగైన ప్యాకేజీ అందించేందుకు అధికారులతో కలిసి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ (BTPS) CE శ్రీ బి. బిచ్చన్న గారు, డిఎస్పి శ్రీ కెవి రాఘవేందర్ రావు గారు మణుగూరు జడ్పిటిసి శ్రీ పోశం నరసింహారావు గారు, భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి పి రవీందర్ రావు , మణుగూరు తహశీల్దార్ నాగరాజు , సీఐ ముత్యం రమేష్ ,ఎస్ ఈ రాంప్రసాద్,ఈ ఈ రమేష్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: