గుండాల సెప్టెంబర్ 1(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో గురువారం మండలంలో భారీగా చేరికలు జరిగాయి వీరందరికీ రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి రోజురోజుకు పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ తో పాటు నేను అండగా నిలుస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకోవడం పార్టీపై జిల్లా అధ్యక్షుడైన నాపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, టి రాము, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: