CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి : నూతన పెన్షన్ లబ్ధిదారులకు కార్డులు అందించిన రేగా

Share it:


గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 1(మన్యం మనుగడ) : టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన నూతనంగా మండలానికి మంజూరైన 372 పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, తాసిల్దార్ సాదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: