గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 27(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును మర్కోడు గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి నవీన్, ఉపాధ్యక్షులు సతీష్,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని విన్నవించుకున్నారు. కొన్ని దశాబ్దాల నాటినుండి ఏజెన్సీలో కల్లుగీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని అలాంటి తరుణంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారి కుటుంబానికి సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీలో ఉన్న గీత కార్మికులను ఇన్సూరెన్స్, సొసైటీలను ఏర్పాటు చేసి వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములలో తాటి వనాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు తాళ్లపల్లి వెంకన్న , చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: