మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గ్రామపంచాయతీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ అమెర్థ కార్యక్రమంలో భాగంగా అమెర్థ కాలనీలోని కొందరిని ఓదార్చి, భరోసా కల్పించి, ఇంకొందరికి ఆత్మ ధైర్యాన్ని నింపి, మరి కొంతమందికి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సేవ కోసం పరితపిస్తూ కాలి నడకన ముందుకు కదిలిన అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్, పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో నెల్లిపాక సోసైటి డైరెక్టర్ తైతల నర్సయ్య, ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ, అమెర్థ పంచాయితీ గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోదుగు వంశీ, ప్రధాన కార్యదర్శి ఇరుగు నాగారాజు, గొల్లగూడెం గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసూల శివ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నజీర్ షోను, మల్లె సంపత్, ఇరుగు కోటయ్య, ఇరుగు నర్సయ్య, ఇరుగు నాగయ్య, మేకల భాస్కర్, మేకల సామేలు, కాలవ సంసోన్, సోషల్ మీడియా అధ్యక్షుడు గజ్జి లోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: