మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గడ్డంపల్లి పంచాయతీలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించునున్న సిసి రోడ్డు, డ్రెయినేజీ కు పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ సోమవారం శంఖుస్థాపన చేశారు.ఈ. సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం సిసి రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కలివేటి సునీల్ కూమర్,మాజి ఎంపిపి పడిగ నాగయ్య,గ్రామస్థులు కలివేటి రాంబాయమ్మ,కార్యదర్శి అజార్ ,తెరసా నాయకులు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: