CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీఆర్ఏ ల డిమాండ్లు నెరవేరాలని ముక్కిడి పోషమ్మ మొక్కిన వీఆర్ఏ లు

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.:

ములుగు జిల్లా మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 67 వ, రోజుకు చేరుకుంది.ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ఏ లు అందరూ సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి హామీలను తొందరగా నెరవేర్చాలని మంగపేట మండల సమ్మె శిబిరం దగ్గర నుండి ముక్కుడు పోషమ్మ గుడి కోమటిపల్లి వరకు పాదయాత్ర చేసి తమ డిమాండ్లు తొందరగా నెరవేరాలని సీఎం కెసిఆర్ తొందరగా జ్ఞానోదయం అయ్యి పేస్కేల్ జీ ఓ ను తొందరగా విడుదల చేయాలని, ఆ తల్లికి మొక్కారు.

 ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా,రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు  పాల్గొనడం జరిగినది.

Share it:

AP

TELANGANA

Post A Comment: