మన్యం మనుగడ ప్రతినిధి , చండ్రుగొండ: పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి అన్నారు. మంగళవారం రవికంపాడు పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరి పత్రాలను ఆమె అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అర్హులందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, రానివారు వెంటనే గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, సర్పంచ్ బానోత్ రన్యా, ఉపసర్పంచ్ పోతురాజు వెంకటలక్ష్మి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూపతి రమేష్, వార్డు సభ్యులు అబ్బాస్ అలీ, ముక్తేశ్వరరావు గాలం రవి,భూపతి శ్రీనివాసరావు, బాదావత్ వెంకటేశ్వర్లు,కాకటి సుదర్శన్, భూపతి చందర్రావు,భూక్య లాలి,నిజాపట్నం మల్లికార్జున రావు ,బానోత్ రామోజీ,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: