మన్యం టీవీ , దుమ్ముగూడెం ::
మహాదేవపురం రైతు వేదిక భవనం లో మంగళవారం ఎఫికోర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన యువతీ యువకులకు నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి ధర్మరాజు మాట్లాడుతూ గిరిజన యువతి యువకుల్లో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ పాలక ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చు కోలేక పోతున్నారని ఆయన అన్నారు. చదువుకున్న యువతీయువకులు ప్రభుత్వాలు అందిస్తున్న నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. మహదేవపురం సర్పంచ్ నూప సుమిత్ర మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని ఉన్నత విద్య తోనే అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించవచ్చు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫికోర్ సంస్థ సిబ్బంది తో పాటు యువతీ యువకులు పాల్గొన్నారు.
Post A Comment: