మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, సీ టైప్ ఎక్సలెంట్ పాఠశాలలో, నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థుల బతుకమ్మలతో విప్ రేగా కాంతారావు కు ఘన స్వాగతం పలికారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ పాటలకు, విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. వారితో కోలాటాలు అడారు.అనంతరం మండలం లోని రాజీవ్ గాంధీ నగర్ లోని శ్రీవిద్య హై స్కూల్ నందు ముందస్తుగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విప్ రేగా కాంతారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా చిన్నారులు బతుకమ్మ చుట్టారా నృత్యాలు చేశారు. విద్యార్థులు,చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆటపాటలతో సందడి చేస్తూ, ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొనడంతో బతుకమ్మ ఆటపాటలు సాంప్రదాయాలను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,భద్రాద్రి జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కినదని అన్నారు.తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అయినా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలను అందజేస్తున్నదన్నారు.పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారని,రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ప్రభుత్వం చీరెలను సారెలుగా కానుకగా అందిస్తున్నదని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆడపడుచులకు ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది అన్నారు.బతుకమ్మ చీరలో పంపిణీకి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా,మొత్తం రూ.339,79 కోట్లు వెచ్చిస్తుంది అన్నారు. ప్రజలందరూ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్,ఎక్స్లెంట్ స్కూల్ డైరెక్టర్ యూసఫ్, శ్రీవిద్య స్కూల్ డైరెక్టర్ నుకారపు రమేష్,స్థానిక ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: