CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీలో మల్లెలమడుగు గ్రామానికి చెందిన పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి  మంగళగిరి రామకృష్ణ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం  నిధులతో  ఏర్పాటు చేసుకున్న విఘ్నేశ్వర మినీ సూపర్ మార్కెట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్  ప్రతిష్ణాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు తో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు, దళితుల జీవితాలలో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాటలు వెయాలనే సంకల్పంతో దళితులు ఆర్థిక బలోపేతం అయ్యేది అందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారన్నారు, దళిత బంధు పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా దళితుల అకౌంట్లో జమ చేయడం జరుగుతున్నది అన్నారు, దళిత బంధు పథకన్ని సీఎం కేసీఆర్  ఒక యజ్ఞంలా  ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు ఇది ఎంత అద్భుతమైన పథకం ఇటువంటి పథకం గతంలో చూడలేదని తెలిపారు ఎంత గొప్పగా విజయవంతం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న సీఎం కేసీఆర్  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మండల యువజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: