CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోషక ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం : ఎంపీపీ ముక్తి సత్యం

Share it:


గుండాల , సెప్టెంబర్23(మన్యం మనుగడ) : పోషకాహారంతోనే గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం ఉంటుందని గుండాల ఎంపిపి ముక్తి సత్యం అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని రైతు వేదికలో పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సిబ్బంది నిర్వహించి గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ ముక్తి సత్యం, సిడిపిఓ తార మాట్లాడుతూ గర్భిణీలకు పోషకాహారం అందించడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చిన్నపిల్లల తల్లులు మెరుగైన ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామక్క, ఉప సర్పంచ్ ఉపేందర్, ఏ సి డి పి ఓ అరుణకుమారి, సూపర్వైజర్లు సాలమ్మ, యశోదమ్మ, సక్కుబాయి, అనురాధ, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: