మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ (44) లబ్ధిదారులకు (44) లక్షల రూపాయల విలువ గల, చెక్కులను, మహిళలకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలు, కులమతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు, దళిత బంధు పథకంలో మొదటి విడత నియోజకవర్గం లో వందమంది లబ్ధి పొందుతున్నారన్నారు, విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి అందజేయడం జరుగుతుంది అన్నారు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సంపన్న వర్గాలను అక్కున చేర్చుకొని ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: