మన్యం మనుగడ,పినపాక:
75వ స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంగా పినపాక మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మణుగూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. భరతమాతకు సంబంధించిన నినాదాలతో మణుగూరు ఉన్నత పాఠశాల నుండి సురక్ష బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, పినపాక మండల ప్రజలు పాల్గొన్నారు. బస్సులు, ఆటోలు ద్విచక్ర వాహనాల ద్వారా వారి గ్రామాలనుండి ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ , మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజానీకం పాల్గొన్నారు.
Post A Comment: