గుండాల సెప్టెంబర్ 16(మన్యం మనుగడ) : పోషకాహారంతోనే తల్లి పిల్లలకు మెరుగైన ఆరోగ్యం ఉంటుందని ఐసిడిఎస్ కాంచనపల్లి సెక్టార్ సూపర్వైజర్ సాలమ్మ అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని ముత్తాపురం ఐసిడిఎస్ కేంద్రంలో పోషకాహార మహోత్సవం లో భాగంగా గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు పోషకాహారం పై అవగాహన కల్పించామని ఆమె పేర్కొన్నారు. పోషకాహారం తీసుకోవడంతోనే తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: