గుండాల సెప్టెంబర్ 16(మన్యం మనుగడ) : అంతర్జాతీయ క్షవర వృత్తిదారుల దినోత్సవం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను క్షవర వృత్తిదారుల దినోత్సవం గా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లందుల నరసింహులు జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షవర వృత్తిదారులంతా ఒక్క తాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. అనేక ప్రాంతాల్లో కులవృత్తిని వదిలేసారని అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వమే క్షవరక్షలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల అప్పారావు, ఏలూరి శ్రీను, కోడిపాక శ్రీనివాస్, దడిగల రమేష్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: