మన్యం మనుగడ, అశ్వారావుపేట: గిరిజనులకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు 6% నుంచి 10% పెంచుతున్నట్లు, పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేస్తామని జిఓ విడుదల చేయటం, దళిత బందులానే గిరిజనులకు కూడా గిరిజన బంధు పథకం ప్రవేశపెడతామని శనివారం హైదరాబాదులో జరిగిన ఆదివాసి బంజారా ఆత్మీయ సమ్మేళన సభలో బహిరంగ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి అశ్వారావుపేట నియోజక వర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుకి అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గిరిజన సంఘాలు గిరిజన ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారం రాజశేఖర్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు నుండి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ప్రత్యేకంగా గిరిజనుల అభ్యున్నతి కోసం హైదరాబాద్ లో కొమరం భీమ్, సేవాలాల్ భవనాలను ఏర్పాటు చేశారనన్నారు గిరిజనుల కోసం రిజర్వేషన్ శాతం పెంచడం పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేయడం కోసం జీవోను విడుదల చేయడం, దళిత బంధు తరహాలో గిరిజన బందును కూడా అమలు చేస్తానని హామీ ఇవ్వడం పట్ల యావత్ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి అన్ని ప్రాంతాల వారి గురించి ఆలోచించే నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అని కొనియాడారు. వినాయకపురం సర్పంచ్ పొడియం సత్యావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఎంపిటిసి మారుతి లలిత, నారాయణపురం సర్పంచ్ కంగాల పరమేష్, పలువురు గిరిజనులు, పార్టీ నాయకులు, టెలికాం అడ్వైజర్ కమిటి మెంబర్ బిర్రం వెంకటేశ్వర రావు, నాయకులు చందా లక్ష్మి నరసయ్య, యుఎస్ ప్రకాష్ రావు, కలపాల శ్రీనివాసరావు, నారాయణపురం సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు, మండలం యూత్ కార్యదర్శి ఆకుల శ్రీను, యువజన నాయకులు రఘురామ్, చిప్పనపల్లి శ్రీను, పొడియం వెంకటేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: