మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం పెరాయిగూడెం గ్రామ పంచాయతీ, మోడల్ కాలనీలో పది కుటుంబాల వారు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. వీరిని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ట్రెజరర్ గొల్లమందల పెంటయ్య, మండల ప్రధాన కార్యదర్శి తగరం రామ్, నివాస్ యూత్ నాయకులు ప్రకాష్. పొదిలి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: