మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సీతారాంపురం పంచాయతీలో గల బొమ్మరాజు పల్లి అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సునీత పౌష్టికాహారం తీసుకోవడం వలన తల్లులకు, పిల్లలకు కలిగే లాభాలను గురించి వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ప్రతి గర్భిణీ స్త్రీ తీసుకోవాలని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గా ఉండడానికి పౌష్టికాహారం చాలా అవసరమని తెలియజేశారు.బాలామృతము వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Post A Comment: