మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 21.:పోషకాహార మహోత్సవం సందర్భంగా ధర్మవరం 2, అంగన్వాడి సెంటర్ లో మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించారు. అయ్యవారిపేట అంగన్వాడి పరిధిలో వికలాంగుల పిల్లలకు నీలాంజలి, సుప్రియ, వైద్య పరీక్షల కిట్టు, న్యూట్రిషన్ ఫుడ్, అందించారు. అనంతరం సిడిపిఓ కే ముత్తమ్మ మాట్లాడుతూ గర్భవతులకు పోషకాహారం, ఐరన్ తో కూడిన ఆహారం తీసుకోవాలని, అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడి టీచర్స్ సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం, బెనిని, ఎంపీటీసీ కమల, అంగన్వాడీ టీచర్స్ సూపర్వైజర్, రమాదేవి, హెచ్ వి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: