CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

65వ, రోజుకు చేరుకున్న గ్రామ సేవకుల నిరవధిక సమ్మె

Share it:



మన్యం మనుగడ, మంగపేట:

ములుగు జిల్లా మంగపేట మండలంలో గ్రామ సేవకుల నిరవధిక సమ్మె 65 వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న గ్రామ సేవకులు లు అందరూ నినాదాలు చేస్తూ ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులు అందరు ఒక్కొక్కరుగా పిట్టల్లా రాలిపోతున్నారని, ఇంకా ఎంత మంది చనిపోతే  సీఎం కెసిఆర్ స్పందిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవకుల బ్రతుకులతో చెలగాటం ఆడుకుంటుందని,గ్రామ సేవకుల ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్న చూస్తూ ఉన్నారు కానీ స్పందించడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు.గ్రామ సేవకులు ప్రభుత్వాన్ని గోంతెమ్మ కోరికలు ఏమి కోరలేదని, తమ పనికి తగిన వేతనం, సమాజంలో తగిన గౌరవం అడుగుతున్నామని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సేవకుల  మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను, మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: