మన్యం మనుగడ, పినపాక: తెలంగాణ వీరవనిత, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 127 వ జయంతిని పినపాక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ఎంపీపీ గుమ్మడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మకు పూలతో ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రలు నేటి తెలంగాణ సమాజం తెలుసుకుంటుందన్నారు.పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి, రజాకార్లను తరిమికొట్టిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి అజార్,టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, దొరబాబు, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: