మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీలో పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న భోగ్యం మంగమ్మ ఇటీవల కెన్సర్ వ్యాధితో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దిశ అధ్యక్షురాలు స్థానిక ఎంపీటీసీ వేముల భారతి మరియు వారి బృందం అక్కడికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు, అంతే కాకుండ ఆర్ధికంగా చితికి పోయిన ఆ కుటుంబానికి అయిదు వెలరూపాయలు సహాయం అందించి వారికీ ఆసరాగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మంగమ్మ తన భర్త పుల్లయ్య ప్రజాక్షేత్రంలో వున్నారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో వుంటూ అన్ని విధాలుగా ప్రజలకు సహకరించేవారని వారు మన మధ్య లేకపోవడం తీరని లోటని వేముల భారతి అన్నారు. ఈ కార్యక్రమం లో దిశ మండల అధ్యక్షులు రాలు మరియు అశ్వారావుపేట 6వ వార్డ్ సభ్యురాలు ఎండీ రెహానా బేగం మరియు దిశ సభ్యులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: