మన్యం టీవీ, దుమ్ముగూడెం::
మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కొత్త పల్లి చెరుపల్లి మారాయి గూడెం నరసాపురం భీమవరం లచ్చిగూడెం గ్రామాల్లోని పాఠశాల పిల్లలకు హైదరాబాదు వసుధ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సాగి శ్రీనివాసరాజు చేతుల మీదుగా ఉచిత నోట్ బుక్స్, పెన్నులు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గిరిజన గ్రామాల్లో పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన వసుధ ఫౌండేషన్ సంస్థకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేసు వెంకటేష్ రాము రామకృష్ణ రాజు వీరభద్రం సుధాకర్ శివకుమార్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: