మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని చాకలి ఐలమ్మ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను ఐలమ్మ స్థూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం.సాయుధ పోరాటం చేసి ఆనాటి నిజాం దొరలను ఎదిరించి పోరాడిన విజయ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, రజకులంతా సంఘటితమై కులం కట్టు,మడేల్ కట్టు అంటూ ఒకే మాట మీద ఉండాలని ఐలమ్మ స్ఫూర్తిని నింపుకొని ప్రతి ఒక్కరు రజకులు ఆశయ సాధన కోసం ముందుకు నడపాలని అన్నారు 18 రాష్ట్రాలలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, అలానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పోరాటం చేయాలని పెద్దలు సూచించారు.ఈ కార్యక్రమంలో మన రజక సంఘం మండల అధ్యక్షులు ముక్కెర రామస్వామి,తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎడ్ల శ్రీనివాస్,చాకలి ఐలమ్మ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు రాపర్తి శ్రీహరి,రాపర్తి.నరహరి, కుమ్మరి కుంట్ల సుధాకర్, ఓరుగంటి సోమేశ్,రమేష్, బిక్షపతి,జానీ,వెంకన్న,నరేష్,మహిళలు సరిత,వెంకటమ్మ, రాణి,సుజాత,ప్రమీల,లక్ష్మి నిహారిక,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: