CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ పార్టీ నుండి 20 కుటుంబాలు టిఆర్ఎస్ లో చేరిక : ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రభుత్వ విప్ రేగా

Share it:


గుండాల/ఆళ్లపల్లి, సెప్టెంబర్ 10(మన్యం మనుగడ) :  ఆళ్లపల్లి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీకి చెందిన 20 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం మణుగూరులో దళిత బంధు సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, ఎంపీపీ మంజు భార్గవి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని అన్నారు. దళిత బంధు పథకం ఒక అద్భుతమైనదని ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాతాయని అన్నారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమందరం బాసటగా నిలవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి ఖయ్యూం,  సోషల్ మీడియా అధ్యక్షులు సందీప్ ,పార్టీ నాయకులు కీసరి నరేష్ , పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: