మన్యం టివీ, దుమ్ముగూడెం::
సిపిఐ 24 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో మందపాటి సుధాకర్ రెడ్డి నివాసంలో బుధవారం కొర్స రమేష్ అధ్యక్షతన పార్టీ కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే24వ జాతీయ మహాసభలకు కార్య కర్తలు వేలాదిగా తరలిరావాలని వారు కోరారు. 47 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ జాతీయ మహా సభకు ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుండి పార్టీ ప్రతినిధులు , ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు.ఈ వేధికపై దేశంలో పాలన చేస్తున్న మతోన్మాద శక్తులను గద్దె దించాలని దృఢ సంకల్పంతో బిజెపి చేస్తున్న అరాచక పాలన సాగనంపాలని అన్నారు.దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పేద ప్రజల అభివృద్ధిని తుంగలో తొక్కుతూ దేశ సంపద మొత్తం సంపన్న వర్గాలకు దోచిపెడుతున్నాదని అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరంగా చేస్తూ సంపదనంతా కొందరికి దోచిపెడుతున్నారు.ఈ సమావేశంలో ఎంపిటిసి కుంజా కనక రత్నం, నాయకులు నోముల రాంరెడ్డి, కిలిమి ఎల్లారెడ్డి, తాటిపూటి రమేష్, వర్స గౌరయ్య ,బొల్లోజు వేణు, అమరావాది శంకర్, బోనగల లింగయ్య,మాట్టా నర్సింహారావు, ఎర్రయ్య, కోటేశ్వరరావు, కారం రమణమ్మ,పెనుబల్లి లక్ష్మిబాయ్ పాల్గొన్నారు..
Post A Comment: