మన్యం మనుగడ, ఏటూరు నాగారం :
ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామపంచాయతీ లోని 13 వ వార్డుకు చెందిన బత్తుల పాపమ్మ ఇల్లు గత పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అకస్మాత్తుగా కూలిపోయి అనాధగా మారింది.నిరుపేద అయిన పాపమ్మ తనకు న్యాయం చేయాలని బాధితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది.స్థానిక తాసిల్దార్,సర్పంచ్ వార్డు మెంబర్ ఆధ్వర్యంలో కలసి పంచనామ నిర్వహించి, ఏటూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కి నివేదిక పంపించడం తో ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కును ఐటిడిఏ పి ఓ అంకిత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బాధితురాలు పాపమ్మకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏపీవో వసంతరావు,ఎస్ ఓ రాజ్ కుమార్, ఈఈ హేమలత, వార్డు మెంబర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: