మన్యం టీవీ, చర్ల : ఈరోజు చర్ల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పోడు భూమి రైతులతో పాలాభిషేకం చేశారు. అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 140 విడుదల చేసి పోడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ మరియు రాష్ట్ర మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మరియు భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ జీవో రావడానికి కృషిచేసిన వారికి చర్ల మండల పోడు సాగుదారుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పోలిన లంక రాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, సర్పంచ్లు కాపుల కృష్ణార్జున రావు, కోరం నాగేంద్ర, సీనియర్ నాయకులు ముమ్మినేని అరవింద్, దొడ్డి తాతారావు, అజీజ్, తడికల లాలయ్య,పొలిన రామచంద్రరావు, ఎడ్ల రామదాసు, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, తూర్రం రవి, గూండొజు నాగరాజు, రెడ్డి, వేములవాడ కృష్ణ, తోటమల్ల రవి, కొంబతిని రాము, రావుల కిషోర్, ఆవుల శ్రీకాంత్, తడికెల బుల్లెబ్బాయి,కోంగూరి సోమరాజు, గంపల రమేష్,తడికల వెంకటేశ్వర్లు,కోంగూరి నరసింహారావు తతిదరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: