మన్యం టీవీ , దుమ్ముగూడెం :: ఎన్నో ఏళ్లుగా మొండి సమస్యగా ఉన్నటువంటి పోడు భూముల రైతులు సమస్యను పరిష్కరించడానికి 140 జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి చిత్రపటానికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మొండి సమస్యగా ఉన్నటువంటి పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 140 విడుదల చేసి పోడు రైతుల జీవితాల్లో వెలుగు నింపారని ఈ సందర్భంగా తెలిపారు అలానే ఈ జీవో రావడానికి కృషి చేసిన మంత్రి అజయ్ కుమార్ సత్యవతి రాథోడ్ ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్ల వెంకటరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కామేశ్వరరావు జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి ఎంపీటీసీలు భీమరాజు తిరుపతిరావు సర్పంచులు వెంకటేశ్వరరావు కొండయ్య కాటిపోయిన వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ నాయకులు ఆదినారాయణ శేఖర్ వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు వాగే వెంకటేశ్వరావు మోతుకూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: