దమ్మపేట:(ములకలపల్లి )మన్యం మనుగడ ప్రతినిధి :
దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి రంగు సాయికుమార్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు.నిరుపేద కుటుంబంలో రంగు రంగాచారికి జన్మించిన సాయి కుమార్ చిన్నప్పటినుండి క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని,తన అకుంటిత దీక్షతో కాకతీయ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్ సాధించి తన కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టారు. దీనితోపాటు ప్రస్తుతం చెన్నైలో మంచి ఉద్యోగం కుడా పొందాడు. ఈసందర్బంగా పలువురు గ్రామస్తులు, స్నేహితులు సాయికుమార్ ను అభినందించారు.
Post A Comment: