CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు కృతజ్ఞతలు...తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు- పూదోట సూరిబాబు, జి.వెంకటేశ్వర్లు

Share it:


మన్యం మనుగడ ,భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 25 :
జర్నలిస్టు లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల సమస్య ను పరిష్కరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు జర్నలిస్టులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు అన్నారు.. తెలంగాణలోని జర్నలిస్టు సంఘాల దీర్ఘకాలిక డిమాండ్ అయినటువంటి ఇంటి స్థలాల కేటాయింపులకు సంబంధించిన కేసును పరిష్కరించి విలేకరుల పట్ల  సహృదయం చాటుకున్నారని వారు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. కాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జర్నలిస్టు మిత్రులకు ఇచ్చిన ఇంటి స్థలాల వాగ్దానాన్ని అమలు పరుస్తామని ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ కు జర్నలిస్టుల తరఫున వారు అభినందనలు తెలిపారు.. ఇది ముమ్మాటికీ జర్నలిస్టుల విజయమని వారు అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: