మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు ద్విచక్రవాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలాఉన్నాయి.మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను ఉదయం దర్శించుకుని తిరిగి కమలాపురం మీదుగా కొత్తగూడెం పట్టణం కు వెళుతున్న ఓకారు అంబేద్కర్ విగ్రహం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న కమలాపురం కు చెందిన ఓ బైక్ ను బలంగా ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న కమలాపురం కు చెందిన కృష్ణ (35),మహారాజుల రాజేష్(30)లకి బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వారు క్షతగాత్రులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Post A Comment: