గుండాల/ఆళ్లపల్లి ఆగస్టు18(మన్యం మనుగడ) రాళ్లపల్లి మండలానికి హాల్ మంజూరైనట్లు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. సిడిపి నిధుల నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే రేగా తెలిపారు. ఆళ్ళపల్లి మండలం మార్కోడ్ గ్రామములో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు, పాలనాపరమైన అనుమతులు లభించినందున త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రేగా తెలిపారు.
Post A Comment: