మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన గంగోలు డబల్ బెడ్ రూమ్ ,సున్నం బట్టి, వర్క్ షాప్ గ్రామంలోని మహిళా సంఘం సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర వస్తువులను అందజేశారు.ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మురళీకృష్ణ సౌజన్యంతో లక్ష్మీ నగరం బ్యాంకు మేనేజర్ గోలి సుబ్బారావు చేతుల మీదుగా ఈ నిత్యవసర వస్తువులను ముంపు బాధితులకు అందజేశారు.లక్ష్మీనగరం ఎస్బిఐ ఎదుట బాధితులకు బియ్యం, వంటనూనె, పప్పు ఇతర కూరగాయలను సహాయంగా అందించగా ఈ కార్యక్రమానికి దుమ్ముగూడెం నాయిబ్ ప్రతాప్ ,ఆర్ ఐ లక్ష్మయ్య లతోపాటు బ్యాంకు సిబ్బంది జి శ్రీనివాస్, సందీప్ కుమార్, గంగేశ్వర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: