మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుండు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు రమేష్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి రాచరిక వ్యవస్థకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తీరు నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ముత్యం సమ్మయ్య గౌడ్, కోడూరు సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు మామిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు బూరబతకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తెలగాని రాము గౌడ్ , సహాయ కార్యదర్శి బంధం రాంబాబు గౌడ్, కోశాధికారి గుండు శ్రీనివాస్ గౌడ్, ప్రచార కార్యదర్శి కోడూరు చిన్న పుల్లయ్య గౌడ్, లీగల్ అడ్వైజర్ గుండు వెంకట నారాయణ గౌడ్ మరియు సంఘం సభ్యులు బూర వెంకట నారాయణ గౌడ్, బూర శంకర్ గౌడ్, కొత్త దామోదర్ గౌడ్ , బూర సురేష్ గౌడ్, గుండు సురేష్ గౌడ్, నిమ్మల వెంకన్న గౌడ్ గొడిశాల రామనాథం గౌడ్, బూర రమేష్ గౌడ్, గుండురవి గౌడ్ , నల్లమాస్ ప్రవీణ్ గౌడ్, కోడూరు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: