మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: విద్యార్థి స్థాయి నుండే నరనరాన దేశభక్తి పెంపొందించుకోవాలని ఎంపీటీసీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు అన్నారు. గురువారం వజ్రోత్సవాలను పురస్కరించుకొని స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో, జాతీయ గీతాలతో భారీ ప్రదర్శన, ఇందిరాగాంధీ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధారా బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు దేశం పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు కోటేశ్వరరావు, కృష్ణారావు, సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇమ్మల్డా, కరస్పాండెంట్ జోష్లీన్, రాణి,లలిత,ఆశ, నరేష్, మాధవి, భవిత, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సూర వెంకటేశ్వర్లు, మల్యం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: