CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని శాంతినగర్ ఏరియాలో వజ్రోత్సవ వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పలు రకాల మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో భాగంగా ప్రతి ఇంటిపై ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేసి స్వతంత్ర భారత కీర్తిని దశదిశలా చాటుదామని పిలుపునిచ్చారు.75వ భారత స్వతంత్ర వజ్రోత్సవవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇంటింట జెండా పండుగ జరగాలని సీఎం కేసీఆర్ ప్రజలకు,పిలుపునిచ్చారన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జెండాలను ఎగరవేసి జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ మాధవి,మున్సిపల్ అధికారులు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,కార్యదర్శి నవీన్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు,నాయకులు,పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: