మన్యం మనుగడ, అశ్వారావుపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో బాగంగా అశ్వారావుపేట ఫారెస్ట్ శాఖ వారి కార్యాలయం ఆవరణలో మరియు ఉన్నత బాలికల పాఠశాల నందు వన మహోత్సవంలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిదులు మరియు నాయకులతో కలిసి అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు మొక్కలు నాటారు. అనంతరం అశ్వారావుపేట శ్రీ లక్ష్మి శ్రీనివాస దియేటర్ లో విద్యార్థులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర మూవీను వీక్షించారు. అదే విదంగా వెలుగు రిపోర్టర్ నాగబాబు కూమార్తె జన్మదిన సందర్భంగా దియేటర్ లో విద్యార్థులకు అల్పాహారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు, చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమలలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండల అధ్యక్షులు బండి పల్లారావు, మోహన్ రెడ్డి, కాసాని చంద్ర మోహన్, టౌన్ అధ్యక్షులు సంపూర్ణ, కలపాలి శ్రీను, మోటూరి మోహన్, ప్రసాద్, సబ్ డిఎఫ్ఓ తిరుమల రావు, ఎంపిడిఓ విద్యాధర రావు, ఎంఆర్ఓ చల్ల ప్రసాద్, సీఐ బాలకృష్ణ, ఎస్ఐ అరుణ, ఫారెస్ట్ రేంజర్ తదితర అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: