మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని పైడిగూడెం గ్రామానికి చెందిన కాక వీరస్వామి గంగమ్మ దంపతుల రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన నరసాపురం ఆర్ఎంపి వైద్యుడు ఖాజా పాషా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజాతంత్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు సాయన్న మాట్లాడుతూ వైద్యం వికటించి చిన్నారి మృతికి కారణమైన లైసెన్స్ లేని ఆర్.ఎం.పి పై చర్యలు తీసుకుని మృతి చెందిన పాప కుటుంబానికి న్యాయం చేయాలని అలానే మండలంలోని అర్హత లేకుండా ఆర్ఎంపీలుగా చలామణి అవుతూ వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ కి పంపించి కమిషన్ల కోసం పనిచేసే ఆర్ఎంపీలను రద్దు చేయాలని ప్రజాపంథానాయకులు అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అర్జున్ చిన్నయ్య వీరయ్య పార్వతి గంగరాజు తులసి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: