గుండాల ఆగస్టు 10(మన్యం మనుగడ) భారత వానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఆయన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్సై కిన్నర రాజశేఖర్ పేర్కొన్నారు. ఓకే రన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని వజ్రోత్సవాల సంబరాల్లో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. భారతదేశానికి స్వాతంత్రం తేవడం కోసం ఎందరో మహానుభావులు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేసి భారత వరికి స్వతంత్రం తీసుకు వచ్చారన్నారు
Navigation
Post A Comment: