మన్యం మనుగడ కరకగూడెం:పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
బుధవారం 'భారత స్వతంత్ర వజ్రోత్సవం'కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్విని ఆధ్వర్యంలో మోతె అటవీ ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు,అటవీ అధికారులతో కలిసి పలు రకాల మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ.పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాలని ఆమె తెలిపారు.దేశంలోని ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహాత్మా గాంధీ చరిత్ర,తెలంగాణలో స్వతంత్ర సమరయోధులు త్యాగాలను స్మరిస్తూ భవిష్యతు భావితరాలకు తెలియజేయడం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు,అని అన్నారు.
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,తాటి గూడెం సర్పంచ్ కొమురం విశ్వనాథం,ఉప సర్పంచు గాండ్ల సంతోష్,మండల యువజన నాయకులు రావుల శ్రీను,కంటెం నాగేశ్వరరావు,ఆక్బర్ ఖాన్,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్,అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: