మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ముత్యాలమునగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సంతోష్ నగర్ గ్రామంలో మాజీ ఎంపిటిసి,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల రవి దళిత బంధు పథకంతో భాగంగా ఏర్పాటు చేసుకున్న బట్టల షాప్ ను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మేకల రవి కుటుంబ సభ్యులు తెలంగాణ విప్ రేగా కాంతారావు ను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ దేశం లోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి అని ఉద్దేశంతో,దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది అని అన్నారు.దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని,దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు అని పేర్కొన్నారు.దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు అందరూ ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక దళిత బంధు విజయానికి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.కష్టపడి పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విప్ రేగా కోరారు. దళిత బంధు పథకం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి అని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజల మన్ననులు పొందుతున్నారన్నారు.టిఆర్ఎస్ తోనే దళితుల అభ్యున్నతి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పిటిసి పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ కుర్రి.నాగేశ్వరరావు, సర్పంచ్ కొమరం.జంపేశ్వరి, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: