మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సంతోష నగర్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత నందు ఇటీవల కురుస్తున భారీ వర్షాలకు పరిసర ప్రాంతాలలో నీరు నిలువ ఉండడంతో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాలను పరిశీలించారు. అనంతరం నీరు నిలవ లేకుండా శాశ్వత పరిష్కారానిక తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు.అనంతరం సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పిటిసి పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ కుర్రి.నాగేశ్వరరావు, సర్పంచ్ కొమరం.జంపేశ్వరి, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: