మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేగుబల్లి కన్నాపురం గంగోలు గ్రామాల బాధితులకు సిపిఎం నాయకులు పోతినేని సుదర్శన్ దుప్పట్లు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం నుంచి రావలసిన సాయం కోసం పోరాడుతూనే కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు ముఖ్యమంత్రి గతంలో 100 కోట్ల హామీ పక్కనపెట్టి వరదలు వచ్చినప్పుడు 1000 కోట్ల సహాయం చేస్తానని ప్రకటించి వంద రూపాయలు కూడా ప్రకటించలేదని విమర్శించారు అలానే ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల సహాయం మండలంలో 400 కుటుంబాలకు అందలేదని ఈ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలానే సిపిఎం పార్టీ కార్యాలయాలను పునరావస కేంద్రాలుగా మార్చి ప్రజలకు అని వివిధ తోడ్పాటు అందించామని కష్ట కాలంలో ప్రజలకు సిపిఎం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య ఖమ్మం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య అన్నవరపు సత్యనారాయణ వంశీకృష్ణ చిలకమ్మ కోటేశ్వరావు చంద్రయ్య శరత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: